ప్రభుత్వ బాండ్లపై టీటీడీ వివరణ….

by  |
ప్రభుత్వ బాండ్లపై టీటీడీ వివరణ….
X

దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనేది అవాస్తవమని టీటీడీ తెలిపింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదుకు 3 శాతం వడ్డీ మాత్రమే వస్తోందనీ టీటీడీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో టీటీడీకి 7శాతం వడ్డీ వస్తోందని తెలిపింది. అన్నదాన, బర్డ్, గో సంరక్షణ ట్రస్టులు టీటీడీ పైనే ఆధార పడ్డాయని తెలిపింది. అందుకే వడ్డీ ఆదాయం పెంచుకునేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్టు టీటీడీ తెలిపింది. రూల్ నెం. 80 ప్రకారం…ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు తమకు అనుమతి ఉందని టీటీడీ తెలిపింది. 1990లో విడుదల చేసిన 311 జీవోలో ఈ అంశాన్ని పేర్కొన్నారని టీటీడీ చెప్పింది.


Next Story

Most Viewed