- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండల్లో సుమారు 2వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేషియా చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యంలో మార్పులు రావడంతో పాటు, చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది. అలాగే చెట్ల కింద పీహెచ్ 4.5 శాతానికి చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం ఎక్కువవుతోందని స్టేట్ బయోడైవర్శిటీ బోర్డు పరిశోధనలో నిరూపితమైంది.
అకేషియా మెుక్కలపై బయోడైవర్సిటీ చేసిన పరిశోధనల నివేదికను సంస్థ ప్రతినిధులు ఇటీవలే టీటీడీ బోర్డుకు అందజేసింది. దాంతో చివరి టీటీడీ పాలకమండలిలో ఈ అంశంపై చర్చించి చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అకేషియా చెట్లను విడతల వారీగా పదేళ్లలోపు తొలగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ చెట్ల స్థానంలో పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన చెట్లను పెంచాలని టీటీడీ భావిస్తోంది.