జగన్‌కు కృతజ్ఞతలు : వైవీ సుబ్బారెడ్డి

by  |
జగన్‌కు కృతజ్ఞతలు : వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వెసులుబాట్లు, మార్గదర్శకాలతో ఆయా రాష్ట్రాలు వారిని స్వస్థలాలకు చేర్చుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో చిక్కుకుని ఇబ్బందుల పాలైన 400 మంది ప్రకాశం జిల్లా వాసులను రాష్ట్రానికి తరలించడంలో సీఎం జగన్ ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసిందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Next Story