ఇప్పటికిప్పుడు రాజధాని తరలించం

by  |
ఇప్పటికిప్పుడు రాజధాని తరలించం
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పందించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిందన్నారు. గతంలో ఒక్క రాజధాని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందే పరిస్థితి ఉందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. రాయలసీమ అభివృద్ధి కోసం కర్నూలులో హైకోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతోందని.. దీంతో ఇప్పటికిప్పుడు విశాఖకు రాజధాని తరలించే పరిస్థితి ఉందన్నారు. సీఎం జగన్ రాజధాని తరలింపుపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారిని వెల్లడించారు.

Next Story

Most Viewed