పండగ పూట ప్రయాణికులకు తీపి కబురు..

by  |
పండగ పూట ప్రయాణికులకు తీపి కబురు..
X

దిశ, పటాన్‌చెరు: రామచంద్రాపురం, బీరంగూడ నుండి విజయవాడ, తిరుపతి, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, ఖమ్మం, భద్రాచలం తదితర దూరప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ సాధారణ సర్వీసులకు సీట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని బెల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఈ.వి సత్యనారాయణ తెలిపారు. ఈ బస్సులకు ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసుకుంటే సాధారణ చార్జీతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చన్నారు. www.tsrtconline.in ద్వారా లేదా దగ్గరలోని ఎటిబి ఏజెంట్లను సంప్రదించి లేదా ఆర్టీసీ కౌంటర్లలో, బస్ స్టాప్ కౌంటర్ల ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు.

దసరా పండుగ సందర్బంగా 30 మంది ఉంటే వారు కోరిన చోటికే ఈ ప్రత్యేక బస్సులు పంపడం జరుగుతుందన్నారు. ఈ సదుపాయం రెసిడెన్సియల్ స్కూళ్ళు, రెసిడెన్సియల్ కాలేజీలు, వివిధ అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీల కార్మికులకు అత్యంత ఉపయోగంగా ఉంటుందన్నారు. బస్సులు కావలసినవారు అసిస్టెంట్ మేనేజర్ : 995 961 5886, డిపో మేనేజర్ : 9959226149 కు సంప్రదించాలని కోరారు.

Next Story

Most Viewed