ఈనెల 8 నుంచి టీఎస్‌యూటీఎఫ్ మహాసభలు

by  |
ఈనెల 8 నుంచి టీఎస్‌యూటీఎఫ్ మహాసభలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌యూటీఎఫ్ నాలుగో మహాసభలను ఈనెల 8 నుంచి 10వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఈ సభలను నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ బుధవారం తెలిపింది. కొవిడ్ -19 పరిస్థితుల్లో బహిరంగసభను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఆన్‌లైన్‌లో జరుపుతూ యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ప్రొఫెసర్ జి.హరగోపాల్, మాడభూషి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఐద్వా అఖిల భారత నాయకురాలు ఎస్.పుణ్యవతి పలు అంశాలపై ప్రసంగిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. రెండ్రోజుల పాటు నిర్వహించే ప్రతినిధుల సభకు ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు. చివరి రోజున రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంటారని వివరించారు.



Next Story

Most Viewed