- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కోతలు లేకుండా ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ మెనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం కేసీఆర్ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలలో కోతలు విధిస్తుండడంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గృహాలు, వాహనాలు తదితర కొనుగోలు నిమిత్తం రుణాలు తీసుకున్నవారు సకాలంలో చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జులై 1వ తేదీన ఇచ్చే జూన్ మాస వేతనాలు కోతలు లేకుండా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story