ఎంసెట్ ఎప్పుడంటే….

by  |
ఎంసెట్ ఎప్పుడంటే….
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ ఖరారు అయింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను జెఎన్టీయూ విడుదల చేసింది. ఈ నెల 9,10,11,14తేదిల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో ఎంసెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 79 సెంటర్లను, ఏపీలో 23పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జేఎన్టీయూ తెలిపింది.

ఈ సారి మొత్తం 1,43,165 అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయనున్నారు. హాల్ టికెట్లను గురువారం నుంచి ఈ నెల 7వరకు అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్లను జేఎన్టీయూ అధికారిక వెబ్ సైట్ www.eamcet.tsche.ac.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మాస్క్ లు ధరిస్తూ, డిస్టెన్స్ పాటించాలనీ..శానిటైజర్ వాడాలని సూచించారు.


Next Story

Most Viewed