- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, కరోనా అనేది ఒట్టి ఫ్లూ మాత్రమే అని చెప్పుకొచ్చిన ఆయన..ఇప్పుడు తనకు కరోనా దేవుడి ఆశీర్వాదం వల్లే కరోనా సోకినట్టు చెప్పారు. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.
అందులో…నాకు కరోనా సోకిన తర్వాతే కదా దాన్ని నయం చేయగలిగే డ్రగ్ ఉందని తెలిసిందని, ముఖ్యంగా రెజెనెరన్ మందులను వాడటం వల్లే అదెంత ప్రభావవంతంగా పనిచేసిందో అనుభవమైందని చెప్పుకొచ్చారు. తనకు చికిత్స చేసిన వైద్యులను ప్రశంసించిన ఆయన, అమెరికా ప్రజలకు కూడా తనకు అందిన స్థాయిలోనే ఉచితంగా చికిత్స అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అదే వీడియోలో కరోనా వ్యాప్తి చెందిన చైనాపై మరోసారి మండిపడ్డారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.