టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇళ్లల్లోనే జరుపుకోవాలి

by  |
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇళ్లల్లోనే జరుపుకోవాలి
X

దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎవరి ఇళ్లల్లో వారే జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎవరి ఇళ్లపై వారు గులాబీ జెండాను ఆవిష్కరించడంతో పాటు, భౌతిక దూరం కూడా పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం కేసీఆర్ నిరంతరంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయంలో జరిగే ఆవిర్భావ వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీలోని నూతన పార్టీ కార్యాలయంలో మంత్రి గులాబీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు.

tags: trs party establish day, celebrations, do in home, maintain physical distance, minister jagadish reddy


Next Story

Most Viewed