30న లింగోజిగూడ డివిజన్ బై పోల్.. టీఆర్ఎస్‌కు బీజేపీ విజ్ఞప్తి!

by  |
30న లింగోజిగూడ డివిజన్ బై పోల్.. టీఆర్ఎస్‌కు బీజేపీ విజ్ఞప్తి!
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వనస్థలిపురం పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గెలుపొందిన కార్పొరేటర్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 30న ఉపఎన్నిక జరగనుంది.

ఈ నేపథ్యంలోనే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఆకుల రమేష్ కుటుంబం శుక్రవారం మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. లింగోజిగూడ ఉపఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరారు. దీనికి మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక నుంచి టీఆర్ఎస్ తప్పుకున్నట్లు ప్రకటన వెలువడింది.



Next Story

Most Viewed