- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో వనస్థలిపురం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గెలుపొందిన కార్పొరేటర్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 30న ఉపఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఆకుల రమేష్ కుటుంబం శుక్రవారం మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ను కలిశారు. లింగోజిగూడ ఉపఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరారు. దీనికి మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక నుంచి టీఆర్ఎస్ తప్పుకున్నట్లు ప్రకటన వెలువడింది.
Next Story