రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు: కర్నె

by  |
రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు: కర్నె
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ప్రతి విషయంలో లిటికేషన్ పెడుతూ లిటికేషన్ కాంగ్రెస్‌గా మారిందని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన అసెంబ్లీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాత సెక్రటేరియట్‌లో కనీస వసతులు లేవు కాబట్టే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ప్రభుత్వం చేపడుతోందన్నారు. కరోనాను సైతం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కోర్టుల్లో వెలువడుతున్న తీర్పులతోనైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని సూచించారు.



Next Story

Most Viewed