రంజాన్ తోఫా.. గులాబీ ఎమ్మెల్యే బూతుపురాణం

by  |
రంజాన్ తోఫా.. గులాబీ ఎమ్మెల్యే బూతుపురాణం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కిరాణా సామగ్రి డబ్బుల చెల్లింపు విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యాపారిని బండ బూతులు తిట్టాడు. దానికి సంబంధించిన రికార్డింగ్ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 రంజాన్ పండుగ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా తోఫా ఇచ్చాడు. వీటికి పూర్తి డబ్బులు చెల్లించలేదు. వాటి విలువ రూ.42లక్షలు ఉంటుందని సమాచారం. అందులో రూ.12లక్షల చెల్లించగా, మిగతా రూ.30లక్షల డబ్బులు పెండింగ్ ఉన్నాయి. బాకీ పడిన మొత్తాన్ని చెల్లించాలని ఆ వ్యాపారి పలుమార్లు ఎమ్మెల్యే అనుచరులతో అడిగించడంతో సదరు ఎమ్మెల్యే అతనికి కాల్ చేసి బూతు పురాణం తెరిచాడు.

బాధ్యత గల హోదాలో ఉండి తీసుకున్న సరుకులకు డబ్బులు చెల్లించాల్సింది పోయి ఆ వ్యాపారిని బండ బూతులు తిట్టడంతో పలువురు షాక్‌కు గురయ్యారు. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదట వ్యాపారి డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడినా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన వ్యాపారి సైతం సదరు ఎమ్మెల్యేకు గట్టిగానే బదులిచ్చాడు. సామగ్రి తీసుకుని డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా, వ్యాపారిపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Next Story