ఇండియా గేటు దగ్గర పారబోస్తాం.. కేంద్రానికి టీఆర్‌ఎస్ నేతలు హెచ్చరిక

by  |
ఇండియా గేటు దగ్గర పారబోస్తాం.. కేంద్రానికి టీఆర్‌ఎస్ నేతలు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఇంకా అక్కడే ఉంది. అదనపు ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వక ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, రబీలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం చెబుతుందని మంత్రి గంగుల అన్నారు. ‘తెలంగాణలో FCI గోదాములు నిండిపోయి ఉన్నాయి. రైళ్ల ద్వారా బియ్యం తీసుకెళ్లాలి. అదనపు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి’ అని అన్నారు. మంత్రి వేముల మాట్లాడుతూ.. అదనపు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని, తెలంగాణలో ధాన్యం సేకరించి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇండియా గేటు దగ్గర పారబోసి ధర్నా చేస్తామన్నారు.

Next Story

Most Viewed