గుమ్మడిదలలో దామోదర రాజనర్సింహ.. టీఆర్ఎస్‌కు బిగ్ షాక్

by  |
Former Deputy CM Damodar Raja Narasimha
X

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వీరారెడ్డిపల్లి ఉప సర్పంచ్ సత్తయ్య, మాజీ ఎంపీటీసీ శంకర్ ఆధ్వర్యంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ వీరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, నాయకులు ప్రతాప్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మెన్ అనిల్ రెడ్డి, జయశంకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, అన్నారం ఉప సర్పంచ్ మురళి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట నర్సింగ్ రావు, మహిపాల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ రాజు, బాలు, మల్లేష్, శ్రీను, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె.ఎస్.జి యువసేన సభ్యులు సురేష్, మల్లేశ్, సుధాకర్, ఆవినాష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed