- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అశ్వాపురం: మండలంలో ఎవరూ చేయని విధంగా పార్టీ కోసం పని చేస్తున్న తనను.. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అకారణంగా శుక్రవారం రాత్రి యువజన విభాగం అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారని వలబోజు మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నాకు ఎమ్మెల్యేపై ఎంతో గౌరవం ఉన్నది.. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుండి ఇప్పటివరకు పార్టీ అభివృద్ధికి నా వంతు కృషిచేస్తూ వచ్చాను. అయినా, నన్ను పదవి నుండి తొలగించడం ఏమిటి..? గతంలో మీపై బహిరంగంగా వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులపై మీరు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. కానీ, మీ ఆదేశానుసారం పని చేసే నాపై ఇటువంటి చర్యలు తీసుకోవడం నన్ను బాధించింది. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అభిమానిగా ఎవరూ ఉన్నా లేకున్నా పార్టీలో కొనసాగుతాను’.. అంటూ వలబోజు మురళీ వెల్లడించారు.