విషాదం: టీఆర్ఎస్ నేత కన్నుమూత

by  |
విషాదం: టీఆర్ఎస్ నేత కన్నుమూత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కు చెందిన టీఆర్ఏస్ నేత కేశ్ పల్లి (గడ్డం ) ఆనంద్ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటు రాగా.. కుంటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమిచడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి దివంగత నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి తనయుడు. తన తండ్రి ఎంపీగా ఉన్న సమయంలో కొన్ని రోజులు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసారు. 2014లో బీజేపీ తరుపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆనంద్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు. వారిలో ఒకరు సినీ నటి కీర్తి రెడ్డి.


Next Story

Most Viewed