రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే మెచ్చా

by  |
రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే మెచ్చా
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో గోదాం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. సొసైటీ ఆధ్వర్యంలో 750 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, అన్నపురెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్, డీసీఓ వీరబాబు, డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు, జడ్పీటీసీ భారత లాలమ్మ, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సున్నం లలిత, వైస్ ఎంపీపీ మావిళ్లపల్లి రామారావు, మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరావు, సర్పంచ్ మీడియం సురేష్, ఉప సర్పంచ్ మామిళ్లపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed