ఆ ఎన్నికల కసరత్తు మొదలెట్టిన టీఆర్ఎస్

by  |
ఆ ఎన్నికల కసరత్తు మొదలెట్టిన టీఆర్ఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జరుగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును పరిశీలిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్థిగా రామ్మోహన్‌ను నిలిపే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మేయర్‌గా ఉన్న రామ్మోహన్‌ను.. శాసనమండలికి పంపేలా ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే బరిలోకి దింపనున్నారు. ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికలకు.. త్వరలోనే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది.

Read Also…

గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష..!

Next Story

Most Viewed