ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

by  |
ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
X

TRS follower lakshman nayak attempts to suicide at pragathi bhavan

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హైదరాబాద్ ప్రగతి భవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పార్టీలో తనకు న్యాయం జరగడం లేదని, పార్టీ అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెట్టానని ఆందోళన వ్యక్తం చేశారు. తనకి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. జనగామ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్ తన వెంట రెండు బాటిళ్లలో డీజిల్ తెచ్చుకొని ఒక్కసారిగా శరీరంపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనను అడ్డుకొని అరెస్టు చేసి వెంటనే పోలీసు స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

Most Viewed