ప్రజలకు ఆ పార్టీలు చేసిందేమి లేదు: సీతక్క

by  |
ప్రజలకు ఆ పార్టీలు చేసిందేమి లేదు: సీతక్క
X

దిశ, సికింద్రాబాద్: అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా ప్రజలకు టీఆర్ఎస్, బీజేపీలు చేసేందేమి లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థి నాగులూరి ఇందుమతి గౌడ్ నివాసానికి ఆమె శుక్రవారం వెళ్లారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకూ దాని గురించి ప్రస్తావనే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం వస్తుందని చెప్పారు.


Next Story

Most Viewed