త్రిష షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్..

by  |
త్రిష షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్..
X

హీరోయిన్ త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తమిళ్ లో ఏ మాయ చేసావే సినిమాలో జెస్సీ గా త్రిష నటించగా.. కార్తిక్ గా శింబు నటించారు. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మధ్య త్రిష.. గౌతమ్ మీనన్ తో వీడియో కాల్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కెమెరాను 4K ఫిక్స్ చేసి ఎలా షూట్ చేయాలో సూచనలు ఇచ్చాడు గౌతమ్. అప్పుడే ఇద్దరూ కలిసి ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తున్నారని అనుకున్నారు.

ఆడియన్స్ ఎక్ష్పెక్ట్ చేసినట్లే ట్రీట్ వచ్చేసింది. షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేశాడు. కార్తిక్ డయల్ సితాయెన్ పేరుతో షార్ట్ ఫిల్మ్ చేస్తుండగా.. త్రిష( జెస్సీ) తన బాయ్ ఫ్రెండ్ కార్తిక్ తో మాట్లాడుతుంది. కార్తిక్ నువు గొప్ప ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు.. లాక్ డౌన్ వల్ల నువు కలత చెందకూడదు.. త్వరలో మళ్లీ సినిమా హాళ్లు తెరుచుకుంటాయి.. నువు గొప్ప కంటెంట్ సృష్టించగలవు అని భరోసా ఇస్తుంది.

Next Story

Most Viewed