మొబైల్ ఫోన్ మాయాజాలం.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. సజ్జనార్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
మొబైల్ ఫోన్ మాయాజాలం.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. సజ్జనార్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వస్తువు మొబైల్ ఫోన్. ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్లు పట్టుకుని తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. ఫోన్ చూస్తూ రోడ్లు దాటడం, డ్రైవింగ్ చేయడం లాంటివి చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ ఫోన్ నడుస్తూ ఫోన్ చూడటంతో డ్రైనేజ్‌లో పడిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మేరకు.. ‘‘మొబైల్ ఫోన్ మాయాజాలం! ముందు వెనుక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

VC Sajjanar's tweet on cell phone usage



Next Story

Most Viewed