- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: రెచ్చిపోయిన మందుబాబులు.. ట్రైన్లో మద్యం సేవిస్తూ హల్చల్
కదిలే రైలులోని ఓ బోగీలో కొందరు యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తూ, ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కదిలే రైలులోని ఓ బోగీలో కొందరు యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తూ, ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ వీరు చేసిన హల్చల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిగజారుతున్న సివిక్ సెన్స్
రైలులో తోటి ప్యాసింజర్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా మందు తాగుతూ హంగామా చేశారు. ఈ వ్యవహారం వీడియో రూపంలో బయటకు రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. తోటి ప్రయాణికుల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారతీయుల్లో ‘సివిక్ సెన్స్’ (సామాజిక బాధ్యత) రోజురోజుకూ దిగజారిపోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.
రైల్వే అధికారులు ఏం చేస్తున్నట్లు?
ఈ ఘటన కచ్చితంగా ఏ మార్గంలో వెళ్లే రైలులో జరిగింది? ఆ యువకులు ఎవరు? అనే వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ స్థాయి ఉల్లంఘనలు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారతీయ రైల్వే చట్టాల ప్రకారం, రైళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. రైల్వే అధికారులు ఏం చేస్తున్నట్లు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి, ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






