చీరలు దొంగలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి !

by velandi.Saikiran |

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది. దొంగతనం చేసిన నేపథ్యంలో తెలుగు మహిళను అత్యంత దారుణంగా కొట్టారు

చీరలు దొంగలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి !
X

దిశ‌, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది. దొంగతనం చేసిన నేపథ్యంలో తెలుగు మహిళను అత్యంత దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీరలు దొంగిలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్ళి దారుణంగా కొట్టాడు దుకాణదారుడు. బెంగళూరులోని అవెన్యూ రోడ్డులో మియా సిల్క్ సారీ దుకాణం ఉంది. పండుగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆ దుకాణంలో... హడావిడి వాతావరణం నెలకొంది.

కస్టమర్లు విపరీతంగా వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే దాదాపు 91 వేల 500 రూపాయల విలువైన చీరల కట్టను తెలుగు మహిళా దొంగిలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ లో... దుకాణపు సిబ్బంది గుర్తించింది. దొంగిలించిన మరుసటి రోజు ఆ మహిళ అటువైపు వెళుతుండగా ఆ దుకాణపు సిబ్బంది చూశారు. దీంతో వెంట‌నే మియా సిల్క్ సారీ దుకాణం ఓన‌ర్‌... ఆమెపై దాడి చేశాడు. దారుణంగా కొట్టాడు. అయితే.. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ కావ‌డంతో రంగంలోకి పోలీసులు దిగారు. దీనిపై విచార‌ణ చేస్తున్నారు. క్లిక్

Next Story