ఆ బిల్లుతో పారదర్శకత పెరుగుతుంది..

by  |
ఆ బిల్లుతో పారదర్శకత పెరుగుతుంది..
X

దిశ,వెబ్ డెస్క్: వ్యవసాయ బిల్లులపై రైతులతో అవగాహన సమావేశాలను ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. మార్కెట్ యార్డులో ఏ సమస్యలున్నా సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ బిల్లులో మార్కెట్ యార్డు తొలగించాలని చెప్పలేదని తెలిపారు. మార్కెట్ యార్డులను విస్తరించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకునే అంశం మాత్రమే ఈ బిల్లులో పేర్కొన్నామని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టం పూర్తిగా అమలైతే రైతులు రోడ్డు ఎక్కే అవసరం ఉండదని ఆయన తెలిపారు. నూతన వ్యవసాయ చట్టంతో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.


Next Story