జూబ్లీహిల్స్ పీఎస్‌లో రేవంత్.. వాళ్లు మీ ‘అల్లుళ్లా’ అంటూ పోలీసులపై ఫైర్.(వీడియో)

by  |
జూబ్లీహిల్స్ పీఎస్‌లో రేవంత్.. వాళ్లు మీ ‘అల్లుళ్లా’ అంటూ పోలీసులపై ఫైర్.(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ నాయకులు తన ఇంటిని ముట్టడించి దాడికి దిగితే.. వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎలా అరెస్ట్ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి బుధవారం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో నిన్న జరిగిన టీఆర్ఎస్ నేతల ఇంటి ముట్టడిపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలేదో చెప్పాలని ప్రశ్నించారు.

దాడులు చేయడానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేయకుండా.. నన్ను కలవడానికి వచ్చిన వారిపై కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు. వారిపై ఎలాంటి దాడి చేసినా సహించేదిలేదని తెలిపారు. దాడి ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని మా అనుచరులను విడుదల చేయాలని డీసీపీతో మాట్లాడినట్లు తెలిపారు. తనపై కూడా దాడులు చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

కానీ, నిన్న దాడి చేసిన టీఆర్ఎస్ వాళ్లు కేసు పెట్టారని పోలీసులు నా అనుచరులను అరెస్టు చేసి, మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారన్నారు. మాపై దాడి చేసిన వారు ప్రభుత్వానికి అల్లుళ్లాగా తిరుగుతుంటే.. దాడిని అడ్డుకున్న నా అనుచరులు మాత్రం అరెస్ట్ అయి స్టేషన్‌లో ఉన్నారని అన్నారు. తెలంగాణను బీహార్‌గా మార్చేస్తున్నారని, బీహార్ నుంచి వచ్చిన వారిని అధికారులుగా పెట్టి ప్రైవేట్ సైన్యంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాం.. ప్రభుత్వం ఏర్పాటుచేయగానే వారిని వదిలిపెట్టమని రేవంత్ హెచ్చరించారు.

Next Story

Most Viewed