గజ్వేల్ సభకు ముందు రేవంత్‌కు భారీ షాక్.. క్షమాపణ చెప్పిన TPCC చీఫ్

by  |
గజ్వేల్ సభకు ముందు రేవంత్‌కు భారీ షాక్.. క్షమాపణ చెప్పిన TPCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్ హోదాలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్.. థరూర్‌ను విమర్శించారు. ఈ క్రమంలో చివరకు రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు ట్విటర్ వేదికగా క్షమాపణ చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన థరూర్.. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. ‘మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని రీట్వీట్ చేశారు.

మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకూడదని రేవంత్‌కు సూచించినట్టు తెలిసింది. అయితే శుక్రవారం కేసీఆర్ ఇలాకాలో (గజ్వేల్) సభకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఇలా జరగడం కాంగ్రెస్ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసింది.

సహచర ఎంపీ రేవంత్​ రెడ్డి.. శశిథరూర్‌పై అవమానకరంగా ఇలా కామెంట్స్ చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. థరూర్​పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్‌లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్ విభానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


Next Story