'విద్యుత్​ ఛార్జీల పెంపు మీ అసమర్ధ పాలనకు నిదర్శనం'

by  |
TPCC Chief Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్​ ఛార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాల్లో ఉండటం టీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యమని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపు మీ అసమర్ధ పాలనకు నిదర్శనమని టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్నా.. ఛార్జీలు పెంచడమేమిటని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం వేసే టాక్స్​లతోనే ఆర్టీసీ పతనమైనందని ఆయన గురువారం ట్వీట్​ చేశారు.



Next Story

Most Viewed