వాళ్లను కొట్టి చంపండి.. రేవంత్ సంచలన ఆదేశాలు

by  |
TPCC chief Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు వెంటనే రాజీనామా చేయాలని, అలాంటి నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యేవరకు పోరాటం చేస్తానన్నారు. టీపీసీసీ చీఫ్​నియామకం తర్వాత రేవంత్.. కాంగ్రెస్​నేతల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. దానిలో భాగంగా శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శులు చల్లా వంశీచంద్​రెడ్డి, సంపత్ కుమార్, సిరిసిల్ల నియోజకవర్గ నేత కేకే మహేందర్​రెడ్డితో భేటీ అయ్యారు.

అదే విధంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని, అలా కొట్టడంలో తానే ముందుంటానన్నారు. కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాదని అమ్ముడుపోయారని, అలాంటి సన్యాసులకు సిగ్గు ఉండాలని ఘూటుగా వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటం చేస్తానని, అవసరమైతే స్పీకర్‌పై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొన్నాడని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పుతారన్నారు.

Next Story