- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై నెలకొన్న సందిగ్దతకు హస్తిన నేతలు ఇంకా ఫుల్స్టాప్ పెట్టలేదు. ఇదిలాఉంటే, రాష్ట్రంలోని సీనియర్లు మాత్రం తమకే పీసీసీ పదవి వస్తుందని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసి ఒక్క చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
అయితే, ఎలాగైనా తెలంగాణ పీసీసీ పోస్టు అంశంలో అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్తో సోనియా గాంధీ ఆమె ఇంట్లో సమావేశం అయ్యారు. అకస్మాత్తుగా ఈ భేటీ జరుగుతుండటంతో టీపీసీసీపై తుది ఫలితం వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్కు రథసారధి ఎవరనే విషయంపై ఓ క్లారిటీ రానుంది.