వన్ వీక్‌లో పర్యాటకులకు అనుమతి..

by  |
వన్ వీక్‌లో పర్యాటకులకు అనుమతి..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాకుండా రాష్ట్రానికి భారీగా ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

టూరిజం హోటళ్లను తెరవడమే కాకుండా.. ఆగస్టు 15నుంచి అన్ని చోట్ల బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో టెంపుల్ టూరిజాన్ని పెంచడమే కాకుండా, త్వరలోనే జిమ్‌లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed