చెక్ అవుట్.. టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్స్

by  |
చెక్ అవుట్.. టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఈ మధ్యే ప్రారంభం అయింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ షూటింగ్ దుబాయిలో ప్రారంభం కాగా, ఫిబ్రవరి ఎండింగ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. దీని గురించి రెండ్రోజుల క్రితం అప్ డేట్ ఇచ్చిన మూవీ యూనిట్.. సరికొత్తగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది. చేతిలో తాళాల గుత్తి పట్టుకున్న మహేష్ పిక్ పోస్ట్ చేసి.. చిత్రం విడుదల గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ సినిమాస్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నాయి.

మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అడివి శేషు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమాకు శశికిరణ్ టిక్కా దర్శకులు. జీఎంబీ సినిమాస్, ఎ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రాన్ని జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

తమిళ్ మూవీ ‘అసురన్’ రీమేక్‌గా వస్తున్న విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా..మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియమణి ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్న చిత్రాన్ని మే 14న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన వెంకీ, ప్రియమణి ఫస్ట్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నారు.


Next Story

Most Viewed