బ్రేకింగ్: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు..

by  |
drugs case tollywood
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రసీమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల తరువాత సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ పోలీసులు 2017 జులై 2న 12 డ్రగ్స్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 27 మందిని విచారించారు. అయితే 12 కేసుల్లో మొదట 8 కేసులకు మాత్రమే ఛార్జీషీట్ ఫైల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుల విచారణల్లో 11 మంది ప్రముఖులతో పాటు హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌ను అధికారులు విచారించారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed