ఇవే నా చివరి ఒలంపిక్స్ : మేరీ కోమ్

by  |
ఇవే నా చివరి ఒలంపిక్స్ : మేరీ కోమ్
X

దిశ, స్పోర్ట్స్ : టోక్యోలో జరుగనున్న ఒలంపిక్స్ తనకు చివరివని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించారు. ఒలంపిక్స్ చానల్‌తో మాట్లాడిన ఆమె తన కెరీర్ తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. ‘ప్రస్తుతం నా వయసు 39 ఏళ్లు. ఒలంపిక్స్ వంటి క్రీడల్లో వయసు కూడా ముఖ్యమైన విషయమే. టోక్యో ఒలంపిక్స్ తర్వాత మరో నాలుగేళ్లు కెరీర్ కొనసాగిస్తానో లేదో తెలియదు. ఇవే నా చివరి ఒలంపిక్స్’ అని మేరీ కోమ్ అన్నది.

టోక్యో ఒలంపిక్స్‌లో బాక్సర్ల గరిష్ట వయసు 40గా నిర్ణయించారు. కరోనా కారణంగా ఏడాది పాటు ఒలంపిక్స్ వాయిదా పడటంతో దాన్ని 41 ఏళ్లకు మార్చారు. 2024లో జరుగబోయే పారీస్ ఒలంపిక్స్‌ నాటికి నేను అర్హత వయస్సు కోల్పోతాను అని మేరీ కోమ్ అన్నారు. 2021 లండన్ ఒలంపిక్స్‌లో పతకం గెలిచిన మేరీకోమ్.. చివరిగా స్వర్ణం గెలిచి కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.



Next Story

Most Viewed