Olympics : భారత్‌కు మరో ఎదురుదెబ్బ..

by  |
mary-kom
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తలిగింది. బాక్సింగ్ ప్రీ క్వార్టర్స్‌లో బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలయ్యింది. తొలి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన మేరీకోమ్ రెండో రౌండ్‌లో వాలెనికా చేతిలో 3-2 తేడాతో పరాజయం పాలయ్యారు.

ఇటీవల క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో సత్తా చాటిన మేరీకోమ్ ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి పాలవ్వడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఒక్క వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మినహా వేరే గేమ్స్‌లో మెడల్ సాధించలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు.


Next Story