ఐపీఎల్‌లో నేడు.. చెన్నై Vs ముంబయి

by  |
ఐపీఎల్‌లో నేడు.. చెన్నై Vs ముంబయి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు చైన్నై సూపర్ కింగ్స్‌, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించిన చెన్నై జట్టు ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటి వరకు కేవలం 3 మ్యాచ్‌లే గెలిచి ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్నది. అయితే సీజన్‌ను భారీ విజయాలతో ముగించాలని భావిస్తున్నది. రాయుడు, ధోని, వాట్సన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.

ఈ నేపథ్యంలో వరుస విజయాలతో ఈ సీజన్‌లో ముంబయి జట్టు టైటిల్ నిలబెట్టుకోవడానికి దూసుకుపోతున్నది. 9 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. బలహీనంగా ఉన్న చెన్నైపై విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తున్నది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో ముంబయి జట్టు సమతుల్యంగా ఉండటంతో ఆ జట్టును ఓడించడానికి చెన్నై చెమటోడ్చక తప్పదు. మరి ఇవాళ ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.


Next Story