నిన్న ఒక్కరోజే అన్ని కేసులా..?

by  |
నిన్న ఒక్కరోజే అన్ని కేసులా..?
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజే 15 వేల 968 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, 465 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షల 56 వేల 183 కు చేరింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 14,476కు చేరింది.

Next Story

Most Viewed