ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా వైరస్ కేసుల వివరాలు..

by  |
ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా వైరస్ కేసుల వివరాలు..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. ఆదివారం ఒక్కరోజే 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 23, వలస కూలీలు 11, విదేశాల నుంచి వచ్చినవారిలో 6, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,854 కు చేరుకోగా, ఇందులో 24 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,092 కు చేరుకుంది. ఇంకా 709 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా సోకి ఆదివారం నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 53 కు చేరుకుంది.

Next Story