తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు

by  |
తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. లక్షకు చేరువులో కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1102 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 91,361 కు చేరింది. ఇందులో 68,126 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22, 542 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో 693 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-234, కరీంనగర్ -101, రంగారెడ్డి-81 కేసులు నమోదయ్యాయి.



Next Story

Most Viewed