అయ్య బాబోయ్.. కేసులు భారీగా పెరిగినయ్

by  |
అయ్య బాబోయ్.. కేసులు భారీగా పెరిగినయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. గతకొద్ది రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,018 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య లక్షా 11,688కి చేరింది. ఇందులో 85,223 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 25,685 మంది బాధితులు కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 780 మంది మృతిచెందారు.



Next Story

Most Viewed