దేశంలో 28 లక్షలు దాటిన కేసులు

by  |
దేశంలో 28 లక్షలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతుంది. గత 24 గంటల్లో 69,652 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.

కాగా, ఒక్క రోజులోనే 977 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా 28,36,926 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. కాగా, ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 53 ,866 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 20,96,665 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 6,86,395 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది. అలాగే, దేశంలో కరోనా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.90 ఉంది.



Next Story

Most Viewed