దేశంలో మొత్తం కేసులు 10,38,716

by  |
దేశంలో మొత్తం కేసులు 10,38,716
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తొలుత రోజుకు 10వేల చొప్పున నమోదైన కొత్త కేసులు క్రమంగా 20వేలకు, ప్రస్తుతం 30వేలకు పైగా రికార్డవుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా 30వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో దేశంలో 34,884 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 10,38,716కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 671 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 26,273కు చేరింది. దేశంలో కరోనా సోకిన వారిలో 6,53,750 మంది కోలుకోగా ప్రస్తుతం 3,61,024 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఒక్కరోజే 1475 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,21,582కు చేరింది. ఇక్కడ కొత్తగా 26కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3597 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 8,348 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,00,937కి వెళ్లింది. రాష్ట్రంలో 24 గంటల్లో వైరస్ బారినపడి 144 మంది చనిపోగా మొత్తం మరణాలు 11,596కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 4807 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,65,714కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 88 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2403కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 47,390 కేసులకు గాను 2,122మంది మరణించడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3963 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 52మంది చనిపోయారు. రాష్ట్రంలో వైరస్ సోకి 586మంది మృత్యువాత పడ్డారు.



Next Story

Most Viewed