తమిళనాడు వెళ్లే వారికి ఈ-పాస్ తప్పనిసరి..

by  |
తమిళనాడు వెళ్లే వారికి ఈ-పాస్ తప్పనిసరి..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుండి రాష్ట్రంలో పలు ఆంక్షలు విధిస్తు్న్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

నిబంధనలు ప్రకారం..

– రాష్ట్రంలో పండుగ వేడుకలపై నిషేధం విధించింది.
– విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు రాష్ట్రంలోకి వచ్చేవారికి ఈ- పాస్ తప్పనిసరి.
– తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మతపరమైన కార్యక్రమాలు రద్దు చేస్తు్న్నట్టు తెలిపింది.
– ఆలయాల్లో పూజలు వంటి కార్యక్రమాలకు రాత్రి 8 గంటల వరకే అనుమతి.
– క్యాబ్స్‌లో ముగ్గురు, ఆటోలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.
– హోటళ్లు, టీ స్టాల్స్‌లో 50% సీటింగ్ సామర్థ్యంతో నడపాలి.
– 50 % సీటింగ్ కెపాసిటీతో క్లబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతి. ఫుడ్ పార్సిల్ సర్వీసులకు రాత్రి 11 వరకు అనుమతినిచ్చారు.
– రాజకీయ సమావేశాలు, కల్చరల్ అక్టివిటీస్‌కు, ఎంటర్‌టైన్మెంట్ హల్స్‌లో 200 మందికి మించి హాజరు కారాదు.
– అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మినహాయింపు.
– కూరగాయల మార్కె్ట్లు, గ్రాసరీ షాపుల్లోకి, థియేటర్స్, మాల్స్‌లో 50% కెపాసిటీకి అనుమతి.
– స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేదు.
– కంటైన్‌మెంట్ జోన్ల వద్ద కఠిన ఆంక్షలు అమలు.
– కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న వారికి వాలంటీర్ల సాయంతో నిత్యవసర సరుకులు అందిస్తారు.
– కోయంబేడు మార్కట్‌ను మూసివేస్తున్నట్టు పేర్కొంది.



Next Story