సీఎంకు షాక్.. బీజేపీలో చేరేందుకు క్యూ కట్టిన నేతలు

by  |
సీఎంకు షాక్.. బీజేపీలో చేరేందుకు క్యూ కట్టిన నేతలు
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ జిలానీలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అక్కడ ఇద్దరు మంత్రులతో పాటు పలువురు కీలక నాయకులు గతేడాదిలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ)ని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో వీరంతా కమలం కండువా కప్పుకున్నారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారిలో.. సొనాలి గుహ, దిపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, లాహిరి, శీతల్ కుమార్ సర్దార్‌లు ఉన్నారు. వీరితో పాటు హబీబ్‌పూర్ టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించిన సరళ మర్ము కూడా బీజేపీలో చేరడం గమనార్హం. కాగా.. బీజేపీలో చేరినవారిలో రవీంద్రనాథ్ భట్టాచార్య 2001 నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు. టీఎంసీ నుంచి పోటీచేస్తున్నవారిలో 80 ఏళ్లకంటే ఎక్కువ వయసున్నవారికి ఈసారి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వలేదు. ఇక మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో టీఎంసీ వారికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.



Next Story

Most Viewed