శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

by  |
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్: నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం ఉదయం 11 గంటలకు టికెట్ల కోటా విడుదల కానుంది. ఈ నెల 22 నుంచి డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆర్జిత సేవల వర్చువల్ సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రత్యేకంగా రూ.300 టికెట్ల కోటా టీటీడీ కేటాయించింది. కళ్యాణోత్సవ వర్చువల్ సేవలో పాల్గొన్న భక్తులను ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది. ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు 90 రోజుల్లోపు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ప్రతినెలా చివరివారం శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed