రాత్రి, పగలు తేడా లేకుండా అదే పని.. పట్టుకుని నిలదీసిన గ్రామస్తులు

by  |
Lorries-Detained1
X

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను, జేసీబీని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి గత కొద్దిరోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మొరం అక్రమంగా రవాణా చేస్తూ తమ గ్రామ సంపదను దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు అడ్డుకున్న మొరం టిప్పర్లను, జేసీబీని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.



Next Story

Most Viewed