వమ్మో పులి..

by  |
వమ్మో పులి..
X

దిలాబాద్ జిల్లా ప్రాణహిత పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో గిరిజన గ్రామాలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నాయి. ఎటు చూసినా పులి అడుగుజాడలు కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రుళ్లు పులి గాడ్రింపులు వినబడుతున్నాయని, తెల్లవారు లేచి చూసేసరికి తమ ఇంటి ముందు ఉండాల్సిన పశువుల మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ సమయంలో తమ మీద పులి దాడి చేస్తుందోమోనని ఇంటినుంచి భయటకు కూడా వెళ్లడం లేదని వాపోతున్నారు. ఫారెస్టు అధికారులు పులి కాలి గుర్తులను సేకరించి ఏ వైపు వెళ్లిందో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.


Next Story

Most Viewed