- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఆదివారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఎన్కౌంటర్ ప్రారంభమై కొన్ని గంటలపాటు కొనసాగింది. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ముందస్తు సమాచారం మేరకు రెబాన్ ఏరియాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పోలీసులు ఉగ్రవాదులు సమీపిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు వివరించారు. స్పాట్ నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Next Story