కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

by  |
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమై కొన్ని గంటలపాటు కొనసాగింది. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ముందస్తు సమాచారం మేరకు రెబాన్ ఏరియాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పోలీసులు ఉగ్రవాదులు సమీపిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు వివరించారు. స్పాట్ నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.



Next Story

Most Viewed