కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

by  |

అమరావతి: కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలోని కేకేలైన్‌లో చోటుచేసుకుంది. టైడా – చిముడుపల్లి రైల్వే మార్గంలో పడి ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బండరాళ్ల కింద ఉన్న మృతదేహాలను గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, రాళ్ల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Tags : Three people dead, landslides, Visakha District, police, cake line

Next Story

Most Viewed